వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికులంతా గాఢ నిద్రలో: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 22మంది మృతి!

బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది.

|
Google Oneindia TeluguNews

బరేలి: ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటనలో బస్సు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో 22మంది మృత్యువాత పడగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బరేలీ షహ్జాన్ పూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రమాద స్థలంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. బస్సును డ్రైవర్ సరైన మార్గంలో నడపనందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

17 dead, several injured after bus collides with truck on Bareilly national highway

బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

English summary
In a yet another road accident, nearly 17 people were charred to death and several other injured when a passenger bus collided with a truck on a National Highway in Bareilly on Monday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X