ఎన్ కౌంటర్ భయం? కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, కోర్టులో లొంగిపోయిన గ్యాంగ్ లీడర్, వీడియోలు!
కోయంబత్తూరు: కాలేజ్ విద్యార్థినిపై ఆమె బర్త్ డే రోజు సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ లీడర్ మణికందన్ కోర్టులో లొంగిపోయాడు. మణికందన్ కోసం పోలీసులు అనేక టీంలు ఏర్పాటు చేసి గాలిస్తున్న సమయంలో అతను కోర్టులో లొంగిపోయాడు. ఎక్కడ పోలీసులు తనను ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతోనే మణికందన్ కోర్టులో లొంగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన న్యాయవాదులను వెంట తీసుకెళ్లిన మణికందన్ పోలీసుల కంటికి చిక్కకుండా చాకచక్యంగా కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతి తీసుకుని మణికందన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని కోయంబత్తూరు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!
పార్క్ లో బర్త్ డే పార్టీ !
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సీరనాయకన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అమ్మాయి కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్నది. గత నెల నవంబర్ 26వ తేదీన కాలేజ్ అమ్మాయి బర్త్ డే. ఆ రోజు స్నేహితులతో కలిసి సిరినాయకన్ లోని పార్క్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించుకోవడానికి కాలేజ్ విద్యార్థిని వెళ్లింది.
భలే చాన్స్ చిక్కంది !
రాత్రి బర్త్ డే పార్టీలో అమ్మాయి స్నేహితులతో కలిసి చాలా హుషారుగా గడిపింది. బర్త్ డే పార్టీ ముగిసిన తరువాత రాత్రి కాలేజ్ అమ్మాయి స్నేహితుడితో కలిసి పార్క్ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో ఆరు మంది కామాంధులు కాలేజ్ అమ్మాయి మీద కన్ను వేశారు. పార్క్ లో కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడిని కామాంధులు ఫాలో అయ్యారు.
దాడి చేసిన కామంధులు
పార్క్ లో ఒక్కసారిగా కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడిని నాలుగువైపుల కామాంధులు చుట్టుముట్టారు. ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ?, ఎందుకు ఇంత రాత్రి వరకు ఇక్కడ ఉన్నారు ? ఇక్కడే మీ అంతు చూస్తే మీకు దిక్కెవరు ? అంటూ వారితో గొడవ పెట్టుకున్నారు. తరువాత కాలేజ్ అమ్మాయి స్నేహితుడి మీద నిందితులు ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. అమ్మాయి, ఆమె స్నేహితుడు కేకలు వేయకుండా ఇద్దరి నొర్లు గట్టిగా మూసివేశారు.
ఇక్కడే చంపేస్తాం !
కాలేజ్ అమ్మాయిని, ఆమె స్నేహితుడిని నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లారు. తరువాత నీవు పూర్తిగా బట్టలు తీసివేయాలని, లేదంటే నీ స్నేహితుడిని చంపేస్తామని నిందితులు కాలేజ్ అమ్మాయిని బెదిరించారు. బట్టలు విప్పడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో స్నేహితుడి మీద మళ్లీ దాడి చేసిన నిందితులు కాలేజ్ అమ్మాయికి కత్తులు చూపించి ఆమెను భయబ్రాంతులకు గురి చేశారు. ఇక్కడే ఇద్దర్నీ చంపేస్తామని హెచ్చరించారు.
అమ్మాయికి చిత్రహింసలు !
యువతిని కత్తులతో బెదిరించి నగ్నంగా చేసిన కామంధులు ఆరు మంది ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి పార్క్ నుంచి బయటకు పంపించకుండా నిందితులు కామవాంఛ తీర్చుకున్నారు. అత్యాచారం చేసే సమయంలో నిందితులు మొబైలో వీడియోలు తీశారు. కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించారు. రాత్రి కాలేజ్ అమ్మాయికి చిత్రహింసలు పెట్టిన నిందితులు విషయం బయటకు చెబితే మీ ప్రాణాలు తీస్తామని, మొబైల్ లోని వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి వదిలేశారు.
ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో ?
కాలేజ్ అమ్మాయి ఎస్ఆర్ పుర మహిళా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో రాహుల్ (21), ప్రకాష్ (22), కార్తికేయన్ (28), నారాయణమూర్తి (30) అనే నిందితులను శ్రీరాణైచెన్నపాళ్యం సమీపంలో అరెస్టు చేశారు. కాలేజ్ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (గ్యాంగ్ లీడర్) కుల్ దీప్ మణికందన్, మరో నిందితుడు కోసం పోలీసులు గాలించారు. ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో ప్రధాన నిందితుడు మణికందన్ న్యాయవాదుల సహాయంతో కోర్టులో లొంగిపోయాడు.