14 ఏళ్ల బాలికను రేప్ చేసిన 17 ఏళ్ల బాలుడు, అత్త సొమ్ము అల్లుడు దానం, మరో ముగ్గురు గ్యాంగ్ రేప్!
న్యూఢిల్లీ: పని చేస్తున్న చోట పరిచయం అయిన 14 ఏళ్ల బాలిక (మైనర్)ను నమ్మించి పిలిపించిన 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అనే సామెతలాగా బాలికను మరో ముగ్గురు కమాంధులకు ఆ బాలుడు అప్పగించాడు. జరిగిన అన్యాయం గురించి బాలిక ధైర్యంగా పోలీసులకు చెప్పడంతో నలుగురు కామాంధుల అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Wife for sale: చెత్తనా కొడుకు, మహాభారతం రిపీట్, పేకాట కోసం భార్య పందెం, జల్సా చేసుకోండి ఫ్రెండ్స్ !
పని చేసేచోట పరిచయం
దేశ రాజధాని ఢిల్లీలోని (దక్షిణ ఢిల్లీ) గ్రేటర్ కైలాష్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంటిలో 14 ఏళ్ల బాలిక పని చేసేది. అదే ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు పని చేసేవాడు. ఆ సందర్బంలో బాలుడు, బాలికకు పరిచయం అయ్యింది. ఆ సమయంలో బాలికకు తెలిసీ తెలియని వయసు కావడంతో కొంత కాలం ఇద్దరూ స్నేహితులుగా కలిసి మెలసి తిరిగారు.
ఒక్కసారి రావాలి.... హెల్ప్ చేస్తాను
నెల రోజుల క్రితం బాలిక పని చేస్తున్న చోట ఉద్యోగం మానేసింది. తరువాత కైలాష్ ఆ బాలికతో టచ్ లో ఉన్నాడు. తాను పని చేస్తున్న చోటకు ఒక్కసారి వచ్చిపోవాలి, నీకు మరో చోట ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ ఆ బాలుడు బాలికకు మాయమాటలు చెప్పాడు. ఫ్రెండ్ పిలిస్తున్నాడని ఆ బాలిక శనివారం ఒంటరిగా బాలుడు పని చేస్తున్న దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి వెళ్లింది.
అత్త సొమ్మ అల్లుడు దానం అన్నట్లు
బాలిక గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి వెళ్లిన తరువాత ఆమె 17 ఏళ్ల స్నేహితుడు తియ్యటిమాటలు చెప్పాడు. తరువాత బాలికను గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని సర్వెంట్ క్వాంటర్స్ లోకి తీసుకెళ్లిన 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అనే సామెతలాగా బాలికను మరో ముగ్గురు కమాంధులకు ఆ బాలుడు అప్పగించాడు.
ఆ నలుగురు అరెస్టు
తన మీద 17 ఏళ్ల తన స్నేహితుడితో పాటు 18 ఏళ్లు, 20 ఏళ్లు, 30 ఏళ్ల వయసు ఉన్న మరో ముగ్గురు కూడా అత్యాచారం చేశారని ఆదివారం బాలిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. బాలిక తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు బాలిక మీద అత్యాచారం చేసిన నలుగురు కామాంధులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసిన కామాంధుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
క్రైమ్ రేట్ తగ్గింది మిత్రమా
గత ఏడాదితో పోల్చుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారం కేసులు 28 % తగ్గాయని స్థానిక పోలీసులు అంటున్నారు. గత ఏడాది అక్టోబర్ నెల వరకు 1, 723 అత్యాచారం కేసులు నమోదైనాయని, ఈ ఏడాది సెప్టెంబర్ నెల వరకు 1, 241 అత్యాచారం కేసులు నమోదైనాయని స్థానిక పోలీసులు తెలిపారు. దేశంలో ఎక్కడైనా అత్యాచారం జరిగి మహిళలు హత్యకు గురైతే వాటిని హత్య కేసులుగా నమోదు చేస్తున్నారని, అత్యాచారం కేసులుగా నమోదు చెయ్యకుండా క్రైమ్ రేట్ తగ్గించడానికి కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అనేక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.