లోయలో పడ్డ బస్సు : 18 మంది మృతి
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపుతప్పి బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి జీఎస్ బాలి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కారు బోల్తా ఆరుగురు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో కారు మలుపుతిరుగుతూ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను జేజే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డోంగ్రి పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిసింది.