వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18 మంది పోలీసుల మృతి: ఆందోళనలో ఖాకీలు, 1666 మందికి సోకిన వైరస్...

|
Google Oneindia TeluguNews

కరోనా ప్రబలకుండా డ్యూటీ చేస్తోన్న పోలీసులను వైరస్ కబళిస్తోంది. వైరస్ సోకిన ఖాకీలు మృత్యువాత పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో ఏకంగా 1666 మంది పోలీసులకు వైరస్ సోకింది. అయితే ఇందులో 18 మంది పోలీసులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరింత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

బాలాపూర్ ఏఎస్సైకి కరోనా పాజిటివ్, గాంధీలో చేరిక, 30 మంది సిబ్బందికి పరీక్షలుబాలాపూర్ ఏఎస్సైకి కరోనా పాజిటివ్, గాంధీలో చేరిక, 30 మంది సిబ్బందికి పరీక్షలు

అరుణ్ ఫడ్డారే వైరస్‌తో చనిపోయారని పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఇతను విలే పార్లే పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వయసు పైబడటంతో.. అతను సెలవులో ఉన్నారు. అరుణ్ శుక్రవారం చనిపోయారని పేర్కొన్నారు. రెండురోజుల క్రితం ఏఎస్సై హరిభావు కూడా చనిపోయారు. అతను వైరస్ సోకి మృతిచెందడంతో పోలీసు వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. పోలీసులకు వైరస్ కేసుల సంఖ్య పెరగడం డీజీపీని కూడా ఆందోళనకు గురిచేస్తోంది.మృతుల కుటుంబసభ్యులకు పోలీసు బాస్ సానుభూతి వ్యక్తం చేశారు.

18 maharashtra police died due to coronavirus..

తెలంగాణలో కూడా కొందరు పోలీసులకు వైరస్ సోకింది. వైరస్ సోకిన వారి సంఖ్య 8 కాగా.. ఇటీవల కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి చనిపోయారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా పోలీసు మరణం. నిన్న బాలాపూర్ ఏఎస్సై సుధీర్ కృష్ణకు కరోనా వైరస్ వచ్చింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

English summary
18 maharashtra police died due to coronavirus and 1666 persons infect virus senior police officer said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X