వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని.. స్నేహితుడి గొంతుకోసి, 54సార్లు పొడిచి చంపాడు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని బాంద్రాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ముందు పదే పదే ఇంగ్లీషులో మాట్లాడి, తనకు చదువు రాదని అవమానిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడు అతని స్నేహితుడ్ని కిరాతకంగా హత్య చేశాడు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

గొంతుకోయడంతోపాటు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54సార్లు కత్తితోపొడిచి చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసుల వద్ద లొంగిపోయాడు. బుధవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

18-year-old stabbed 54 times by his friend for ‘speaking only in English’

వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అమిర్ అబ్గుల్ వహీద్ రహీన్(21) అనే యువకుడికి మహ్మద్ అఫ్రాజ్ అలాం షేక్(18) అనే స్నేహితుడున్నాడు. కాగా, తనతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడుతూ.. రహిన్‌ను షేక్ వేధిస్తుండేవాడు.

రహిన్ చదువు కోలేదని తరచూ హేళనగా మాట్లాడుతుండేవాడు. దీంతో కోపం పెంచుకున్న రహిన్.. అలాంను హత్య చేయాలని కుట్ర పన్నాడు. వారం రోజులుగా తగిన సమయం కోసం వేచి చూసిన రహిన్.. బుధవారం రాత్రి అలాంను బాంద్రాలోని నిర్మానుష్య తీసుకెళ్లాడు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం రహిన్ తన స్నేహితుడు అలాం గొంతు కోశాడు. ఆ తర్వాత అతని కడుపు, ఇతర భాగాల్లో 54సార్లు కత్తితో పొడిచాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం రహిన్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం. సాహునగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు రహిన్. జరిగిందంతా చెప్పడంతో.. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అలాం మృతదేహాన్ని గుర్తించారు.

English summary
In a shocking incident, an 18-year-old youth was killed by his friend for allegedly speaking to him in the English language.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X