చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

19 ఏళ్ల బాలిక, హాస్టల్‌లో.. అఘాయిత్యం.. రంగంలోకి పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఏం జరిగిందో తెలియదు, ఏ కష్టమొచ్చిందో క్లారిటీ లేదు. కానీ బంగారు భవిష్యత్ ఉన్న ఓ విద్యార్థిని ఆసువులు బాసింది. తన హాస్టల్‌లోనే ఉరేసుకొని ఊపిరి తీసుకుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలనికి గురిచేసింది. తమ తోటి విద్యార్థిని చనిపోయిందనే విషయం తెలుసుకొని విద్యార్థులు షాక్‌నకు గురయ్యారు.

కత్తితో బెదిరించి, ఆపై అఘాయిత్యం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై...కత్తితో బెదిరించి, ఆపై అఘాయిత్యం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై...

చెన్నైలోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్.. ఎందరినో ఉన్నత స్థితికి చేర్చేందుకు దోహదపడింది. రాజకీయ నేతలు, సినీతారలు కూడా ఇక్కడే విద్యను అభ్యసించారు. అలాంటి చోట కూడా విద్యార్థులు ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. జీవితం ఇక చాలని తనువు చాలిస్తున్నారు.

 19-year-old student commits suicide at hostel..

తమిళనాడు సెంట్రల్ వర్సిటీలో ఓ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. హాస్టల్ గదిలోనే ఆమె ఉరేసుకుందని స్నేహితులు తెలిపారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. చనిపోయిన యువతి మైథిలి అని గుర్తించారు. రాష్ట్రంలోని హోసూరు విద్యార్థి స్వస్థలం అని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

వర్సిటీలో మైథిలి బీఎస్సీ రెండో సంవత్సరం చుదువుతున్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తమకు కూడా తెలియదని తోటి విద్యార్థినులు చెప్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నివేదిక వచ్చాక మృతికి కారణం తెలిసే అవకాశం ఉంది. విద్యార్థిని మృతిపై విచారణ జరిపి నిజనిజాలు వెలికితీస్తామని పోలీసులు చెప్తున్నారు.

English summary
19-year-old student allegedly committed suicide on Sunday by hanging herself at her college hostel in Tamil Nadu' Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X