నా కుమారుడికి బలవంతంగా మత మార్పిడి చేశారు: పెళ్లి చెయ్యడానికి అమ్మాయి తండ్రే !
బెంగళూరు: తమ కుమారుడిని బలవంతంగా ఇస్లాం మతంలో మార్చారని, అతన్ని మాకు అప్పగించి న్యాయం చెయ్యాలని కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న కొన్ని హిందూ సంఘ, సంస్థలు ఆందోళనకు దిగాయి.
మండ్య జిల్లాలోని పాండవపురకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుమారుడు చందన్ (19) అనే యువకుడిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపించడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
స్థానిక ముస్లీం నాయకుడు యూసఫ్ తన కుమార్తెను చందన్ కు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి పక్కా ప్లాన్ వేసుకుని యువకుడికి మతమార్పిడి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ పెళ్లి అడ్డుకోవాలని చందన్ తండ్రి శ్రీనివాస్ పాండవపుర పోలీసులకు మనవి చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పలు హిందు సంఘ, సంస్థలు ఆందోళనకు దిగాయి. హిందూ యువకులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే అసలు విషయం బయటకు లాగడానికి పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు. ముందు జాగ్రత చర్యగా మండ్య జిల్లాలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.