వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పహల్గంలో పడవ బోల్తా .. ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : పర్యాటక ప్రాంతం పహల్గాంలో మరోసారి పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇద్దరి మృతి

2 dead, 4 injured after boat capsizes in Pahalgam

పహల్గాం నుంచి పర్యాటకులతో పడవ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పడవలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మరో నలుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. పడవ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. పడవ ప్రమాదంపై జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటంిచారు. మరోవైపు గతంలో లిద్దర్ నదిలో కూడా మరో పడవ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికులను టూరిస్ట్ గైడ్ అహ్మద్ దర్ కాపాడారు. బలమైన గాలులు వీయడంతో ఆయన నదిలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. దర్ ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరు కొనియాడారు.

English summary
a tourist boat on Tuesday capsized during rafting in Pahalgam, Anantnag. Out of the six tourists in the boat, two died while four were injured in the incident. A rescue operation is underway. Jammu and Kashmir Governor Satya Pal Malik has announced an ex-gratia of Rs 2 lakh, each to the next of kin of those who died in the boat capsizing incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X