For Daily Alerts
మాయావతి ర్యాలీలో తొక్కిసలాట: ఇద్దరు మృతి, 28మందికి గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు.
చాలామంది మంది పిల్లలు తప్పిపోయారు. ఈ భారీ ర్యాలీలో లక్ష మందికిపైగా పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే సభ ముగియగానే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చనిపోయినవారిలో ఓ మహిళ వేడికి తాళలేక మరణించిందని బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.
బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం 10వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా జనం హాజరుకావడం వల్లే ఈ విషాద ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొంటున్నారు.
Ruckus after BSP Chief Mayawati's rally in Lucknow. pic.twitter.com/Lx8Mfll9nd
— ANI UP (@ANINewsUP) October 9, 2016
Comments
English summary
Tragedy struck a huge BSP rally here on Sunday when two aged women were killed and more than a dozen others injured during a stampede, police said.
Story first published: Sunday, October 9, 2016, 15:42 [IST]