వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతనాగ్‌లో ఐఈడీ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హకూరా బోదస్గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. 'తిరిగి గ్రామానికి' అనే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.

2 killed, 4 injured in IED blast in Anantnag

పేలుడు ఘటనలో గాయపడినవారిని అనంతనాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇది ఇలావుండగా, హజ్రత్బల్‌లోని సర్ సయ్యద్ గేట్ ఆఫ్ కాశ్మీర్ యూనివర్సిటీ సమీపంలోని మార్కెట్ వద్ద మరో సేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఇది తక్కువ తీవ్రత గల పేలుడని పోలీసు అధికారులు చెప్పారు. ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ జాతీయ రహదారిపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని పోలీసులు గుర్తించి దాన్ని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

English summary
Two people have been killed and four injured in an improvised explosive device(IED) blast in Jammu and Kashmir's Anantnag district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X