ఇద్దరు మృతి: ఢిల్లీలో ఓ గోడౌన్లో ప్రమాదం.. పలువురికి గాయాలు..
దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. కృతినగర్లో గల ఓ స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా ఎవరైనా మంట పెట్టారా అనే అంశంపై స్పస్టత రావాల్సి ఉంది. మంటలు రావడంతో వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకొని.. మంటలను ఆర్పివేస్తున్నారు.
అప్పటికే మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని ఫైర్ సిబ్బంది తెలిపారు. పలువురు గాయపడ్డారు. సంక్రాంతి రోజున రాత్రి ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఇటీవల కాలంలో ఢిల్లీలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది జనవరిలో కూడా ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు చాలా మంది చనిపోయారు. ఆ ఘటన కళ్లముందు కదలాడుతుండగా.. జనవరిలోనే మరో ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇద్దరు చనిపోయారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.