వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బజాజ్ ఎండీ అపార్ట్‌మెంట్‌లో మంటలు: ఇద్దరి మృతి

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కఫే పరేడ్‌ పరిధిలో గల మేకర్‌ టవర్స్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఉదయం 6.30 గంటల సమయంలో టవర్‌లోని 20వ అంతస్థులో ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన నివాసితులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.

ఫ్లాట్లలో చిక్కుకున్న 11 మందిని పోలీసులు రక్షించారు. పది ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేశాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

కాగా, ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ సంస్థ ఎండీ శేఖర్‌ బజాజ్‌దిగా పోలీసులు గుర్తించారు. ఇదే అపార్ట్‌మెంట్‌లో ప్రముఖ రచయిత్రి శోభా డే కూడా నివసిస్తున్నారు.

English summary
At least two persons were killed on Tuesday in a fire that broke out in an industrialist's apartment in a residential high-rise in Mumbai's Cuffe Parade area, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X