బజాజ్ ఎండీ అపార్ట్మెంట్లో మంటలు: ఇద్దరి మృతి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కఫే పరేడ్ పరిధిలో గల మేకర్ టవర్స్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
#FLASH Two dead in the fire that broke out in Maker Tower in Cuffe Parade area in Mumbai. pic.twitter.com/xfsjxE5t0d
— ANI (@ANI_news) October 18, 2016
ఉదయం 6.30 గంటల సమయంలో టవర్లోని 20వ అంతస్థులో ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన నివాసితులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
#SpotVisuals Fire broke out in Maker Tower in Cuffe Parade area in Mumbai, now under control. pic.twitter.com/zPaXCjywEU
— ANI (@ANI_news) October 18, 2016
ఫ్లాట్లలో చిక్కుకున్న 11 మందిని పోలీసులు రక్షించారు. పది ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేశాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
The flat that was gutted in Maker Tower in Cuffe Parade area in Mumbai belonged to Shekhar Bajaj (MD, Bajaj Electricals).
— ANI (@ANI_news) October 18, 2016
కాగా, ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ సంస్థ ఎండీ శేఖర్ బజాజ్దిగా పోలీసులు గుర్తించారు. ఇదే అపార్ట్మెంట్లో ప్రముఖ రచయిత్రి శోభా డే కూడా నివసిస్తున్నారు.