వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గృహ నిర్బంధంలోనూ ఆంక్షలు సడలింపు: పార్టీ నేతలతో మాజీ ముఖ్యమంత్రులు భేటీ: రాజకీయాల్లేవట

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: నేషనల్ కార్ఫరెన్స్ సీనియర్ నేతలు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాలకు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గృహ నిర్బంధాన్ని కొనసాగిస్తూనే..ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలతో పార్టీ నాయకులు సమావేశం కావడానికి అనుమతి ఇచ్చింది.

పార్టీ నాయకులు గానీ, బయటి వ్యక్తులు గానీ వారిని కలుసుకోవడం ఈ రెండు నెలల కాలంలో ఇదే తొలిసారి. జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడానికి ఒకరోజు ముందే కేంద్ర ప్రభుత్వం వారిని గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయగా.. 4వ తేదీనాడే వారిని హౌస్ అరెస్ట్ లో ఉంచింది. అప్పటి నుంచీ వారు నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆంక్షలను కొద్దిగా సడలించింది.

2 Months Into Detention, Abdullahs Meet Party Leaders In Srinagar

నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఆద్దరు పార్టీ ముఖ్య నాయకులు హస్నయిన మసూది, అక్బర్ లోనే ఆదివారం ఉదయం ఫరూఖ్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లా వారిని సాదరంగా స్వాగతించారు. సుమారు గంటకు పైగా వారు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది తేలాల్సి ఉంది. త్వరలో రాష్ట్రంలో నిర్వహించబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది.

తమ మధ్య ఎలాంటి రాజకీయాల విషయాలు చర్చకు రాలేదని, యోగక్షేమాలను మాత్రమే తెలుసుకున్నామని హస్నయిన్ తెలిపారు. హస్నయిన మసూదీ, అక్బర్ లోనేలతో పాటు సుమారు 15 మంది పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి మధ్య చర్చకు రావాల్సిన అంశాలపై భద్రతా బలగాలు ఆరా తీసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తారనే అనుమానంతోనే తాము ఎలాంటి రాజకీయ అంశాలపైనా చర్చించ లేదని నేషనల్ కార్ఫరెన్స్ నాయకులు, ప్రతినిధి బృంద సభ్యులు స్పష్టం చేసి ఉండొచ్చని చెబుతున్నారు.

English summary
National Conference chief Omar Abdullah and his father and party patriarch Farooq Abdullah were allowed to meet their party leaders for the first time today since he was put in detention two months ago. After the meeting, senior NC leaders Akbar Lone and Hasnain Masoodi told. "We had come to ask about their well-being. No politics was discussed".The two leaders, however, said the party would not participate in the elections for the Block Development Council -- the second tier of the Panchayat Raj system in the state -- because the "entire leadership is in jail".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X