వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోలతో ఎన్‌కౌంటర్: ఇద్దరు పోలీసుల మృతి, సూపర్‌‌వైజర్‌ను చంపేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు తెగబడ్డారు. రోడ్డు పనులు చేయిస్తున్న ఓ సూపర్‌వైజర్‌ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత జెసిబీని, ట్రాక్టర్లను దగ్ధం చేశారు. మొత్తం 12 వాహనాను తగులబెట్టారు. సూపర్‌వైజర్‌ను అనిల్ కుమార్‌గా గుర్తించారు.

తిరుగు ప్రయాణంలో అడ్డు వచ్చిన భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లని సుకుమా జిల్లాలో గల బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Maoists

జిల్లా సాయుధ గార్డులు, స్థానిక పోలీసులు బజ్జి, ఎలర్మడుగు గుండా సాగుతున్న సమయంలో మవోయిస్టులు పెద్ద యెత్తున కాల్పులు జరిపారు దీంతో ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో జిల్లా సాయుధ గార్డులకు చెందిన అసిస్టెంట్ కానిస్టేబుళ్లు మడ్కమ్ హండ, ముకేష్ మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారరు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత వారిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు.

English summary
Two policemen were killed and six others injured in a gun-battle with the Maoists in Chhattisgarh’s Sukma district on Sunday, a top official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X