Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !
చెన్నై/ పుదుచ్చేరి: కరనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో అనేక రంగాల వ్యాపార లావాదేవీలు మూతపడ్డాయి. అనేక రంగాలకు చెందిన వారికి బతుకు బండి లాగడం కష్టం అయ్యింది. ఇదే సమయంలో బలిసిన వ్యాపారవేత్తలు, ప్రస్తుతం షూటింగ్ లు లేక ఖాళీ ఉన్న కొందరు సినిమా నటీమణులను టార్గెట్ చేసుకుని కొందరు హైటెక్ వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు. విలాసవంతమైన గెస్ట్ హౌస్ లు, రిసార్టులు, స్పా, మసాజ్ సెంటర్లు అడ్డాగా చేసుకుని సినిమా నటీమణులతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేయిస్తున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరు చూడలేదని సమాత లాగా ఇప్పుడు ఈ ముఠా వ్యవహరించడంతో అడ్డంగా బుక్కైనారు. ఇద్దరు సినిమా నటీమణులను రక్షించిన పోలీసులు బడా వ్యాపారవేత్తతో సహ ముగ్గురిని అరెస్టు చేశారు. హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ తారలతో ఎవరెవరికి లింక్ ఉంది ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !
లాక్ డౌన్ దెబ్బ
కరోనా వైరస్ కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో అనేక వ్యాపారలావాదేవీలు మూతపడ్డాయి. ఇదే సమయంలో అన్ని బాషల సినిమా షూటింగ్ లు రద్దు అయ్యాయి. ఇక పర్యాటక కేంద్రాల్లో, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోని స్టార్ హోటల్స్, రిసార్టులు, విలాసవంతమైన గెస్ట్ హౌస్ లు మూతపడ్డాయి.
కోలీవుడ్ అమ్మాయిలు, ఆంటీలు
తమిళ సినిమా రంగానికి చెందిన కొందరు అమ్మాయిలు, వివాహిత మహిళలను హైటెక్ వేశ్యవాటిక ముఠా టార్గెట్ చేసుకుంది. ఇదే సమయంలో ఆంటీలు, అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉన్న శ్రీమంతులు, వారి పిల్లలు, వ్యాపారవేత్తల గురించి ఈ ముఠా వివరాలు సేకరించింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్బంగా సినిమా షూటింగ్ లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు అమ్మాయిలు, వివాహిత మహిళలను బుట్టలో వేసుకోవాలని ఈ ముఠా సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు.
రేట్ ఫిక్స్, మద్యలో డీల్, రెచ్చిపోయే రొమాన్స్
శ్రీమంతులు, వ్యాపారవేత్తల్లో ఎవరెవరికి అమ్మాయిల పిచ్చి ఉంది అంటూ ఓ జాబితాను ఈ హెటెక్ వేశ్యవాటిక ముఠా సభ్యులు తయారు చేసుకున్నారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే పుదుచ్చేరితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లోని విలాసవంతమైన రిసార్టులు, మసాజ్ సెంటర్లు, స్పా, స్టార్ హోటల్స్ ను ఎంచుకుంటున్నారు. తరువాత అమ్మాయిల పిచ్చి ఉన్న కొందరు వ్యాపారవేత్తలు, బలిసిన శ్రీమంతులతో మీకు సినిమా నటీ మనుణులను సరఫరా చేస్తామని, వారి రేటు ఇంతా అని ఫిక్స్ చేసి, మీ ఇష్టం వచ్చినట్లు రొమాన్స్ చేసుకోవచ్చని మాయమాటలు చెబుతున్నారు.
ఇక్కడైతే చాలా సేఫ్, సీక్రెట్ గా డీల్
పుదుచ్చేరి పక్కనే విల్లుపురం (తమిళనాడు) జిల్లా ఉంది. లాక్ డౌన్ లో విల్లుపురంలోకి పుదుచ్చేరి నుంచి చాలా సులభంగా వచ్చి వెళ్లడానికి అడ్డదార్లు ఉన్నాయి. విల్లుపురం మంచి సెంటర్ అని భావించిన హైటెక్ వేశ్యవాటిక ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా చెన్నైలో నివాసం ఉంటున్న కొందరు కోలీవుడ్ సహాయ నటీమణులను విల్లుపురం రప్పించుకున్నారు. తరువాత వారిని స్పా, విలాసవంతమైన మసాజ్ సెంటర్లు, రిసార్టులు, హోటల్స్, గెస్ట్ హౌస్ ల్లో ఉండటానికి బస ఏర్పాటు చేసి అక్కడే వ్యాపారవేత్తలతో డీక్ కుదుర్చుకుంటున్నారు.
బిగ్ షాట్ చంద్రూజీ రాసలీలలు
పుదుచ్చేరిలో పేరుపొందిన వ్యాపారవేత్త చంద్రూజీ నివాసం ఉంటున్నాడు. చంద్రూజీకి అనేక వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలతో పాటు చంద్రూజీకి అమ్మాయిల పిచ్చి ఎక్కువగానే ఉంది. ఇక ఏ ముంది హైటెక్ వేశ్యవాటిక ముఠాతో డీల్ మాట్లాడుకున్న వ్యాపారవేత్త చంద్రూజీ చెన్నై నుంచి వచ్చిన ఇద్దరు కోలీవుడ్ నటీమణులను బుక్ చేసుకున్నాడు. మూడు అంతస్తుల విలాసవంతమైన సొంత గెస్ట్ హౌస్ లో చంద్రూజీ రొమాన్స్ చేస్తున్నాడు.
దిమ్మతిరిగిపోయింది
లాక్ డౌన్ అమలులో ఉన్నా విల్లుపురం జిల్లా కొట్టక్కప్పం ప్రాంతం (పుదుచ్చేరి బార్డర్)లోని మసాజ్ సెంటర్లు, స్పా కేంద్రాలు, రిసార్టులకు అమ్మాయిలు, వ్యాపారవేత్తలు వచ్చి వెలుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అంతే వెంటనే అర్దరాత్రి మసాజ్ సెంటర్లు, స్పా కేంద్రాలు, స్టార్ హోటల్స్, గెస్ట్ హౌస్ ల మీద రైడ్ చేశారు. అంతే రైడ్ చేసిన ఓ విలాసవంతమైన గెస్ట్ హైస్ లోని మూడో అంతస్తులో ప్రముఖ వ్యాపారవేత్త చంద్రూజీతో పాటు ఇద్దరు కోలీవుడ్ నటీమణులు రాసలీలలు సాగిస్తున్న విషయం గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు.
చేసింది చాలు పద నాయనా !
కోలీవుడ్ సినిమాల్లో సహాయ నటీమణులుగా పని చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. మసాజ్ సెంటర్ లో పని ఇప్పిస్తామని మమ్మల్ని నమ్మించి ఇక్కడికి తీసుకు వచ్చి కనీసం రోజుకు మూడుపూటల భోజనం కూడా పెట్టకుండా వ్యభిచారం చేయిస్తున్నారని అమ్మాయిలు ఆరోపించారని పోలీసులు అన్నారు. ఒకేసారి ఇద్దరు కోలీవుడ్ నటీమణులతో రాసలీలు సాగిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త చంద్రూజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నువ్వు చేసింది చాలు పద నాయనా అంటూ తీసుకెళ్లారు.
లాక్ డౌన్ లో హైటెక్ దందా
దేశంలోనే పేరు పొందిన ప్రముఖ పర్యాటక కేంద్రం పుదుచ్చేరికి వచ్చి వెలుతున్న పర్యాటకులు, కొందరు వ్యాపారవేత్తలు, శ్రీమంతులను టార్టెట్ చేసుకుని వారికి సినిమా నటీమణులు, ఆంటీలను సరఫరా చేస్తామని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ప్రముఖ వ్యాపారి, గెస్ట్ హౌస్ యజమాని చంద్రూజీతో పాటు ఆయన స్నేహితుడు విజయ్ కుమార్, గెస్ట్ హౌస్ సెక్యూటీ గార్డు అనీల్ జోసెఫ్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దందాలో ఇంకా ఎవరైనా సినీ తారలు ఉన్నారా ? బడా వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నారా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.