వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: హిజ్బుల్ కమాండర్‌తోపాటు మరో ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ శివారులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌, 22 రాష్ట్రీయ రైఫిల్స్‌కి చెందిన భద్రతా దళాలకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో... ఆ ప్రాంతం మొత్తం కార్డన్ సెర్చ్ నిర్వహించి ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టాయి.

2 terrorists killed in encounter in Baramullah, J&K

భద్రతా దళాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై ఎదురుకాల్పులకు దిగినట్టు అధికారులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాదులను హిజ్బుల్ డిస్ట్రిక్ కమాండర్ పర్వేజ్ అహ్మద్, ఉమర్ ఘాజీలుగా గుర్తించారు.

ఉమర్ ఘాజీ మారుపేరుతో తిరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. వీరివద్ద నుంచి ఏకే-47 రైఫిల్‌తో పాటు, మరికొన్ని అణ్వాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కూంబింగ్‌ కొనసాగుతోంది. ఘటనాస్థలిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

English summary
Two terrorists have been killed in an encounter with security forces at Baramulla district in Jammu and Kashmir on Saturday. The security forces also recovered an AK-47, a pistol and ammunition after the operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X