వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంచు వర్షంలో... కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఇద్దరు టెర్రరిస్ట్లు హతం: కొనసాగుతున్న ఆపరేషన్
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని బుద్గాంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మంచు వర్షంలో తీవ్రవాదులతో భద్రతాదళాలు పోరాటం చేశాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. ఓ వైపు గడ్డగట్టే చలి, మరోవైపు వర్షంలు కురుస్తున్న మంచులోనే ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు సిద్ధమయ్యాయి.
శీతాకాలం కావడంతో కాశ్మీర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయింది. అటవీ ప్రాంతంలో మంచు మరింత ఎక్కువగా కురుస్తోంది. బుద్గాంలో ఈ వారం రోజుల్లో ఇది మూడో ఎన్కౌంటర్.
టెర్రరిస్టులు బుద్గాంలోని ఓ ఇంట్లో నక్కి ఉన్నారు. ఇందులో ఇద్దరిని చంపేశారు. బుద్గాం పోలీసులు, సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.
Comments
Jammu Kashmir kashmir terrorists encounter operation crpf police జమ్ము కాశ్మీర్ సీఆర్పీఎఫ్ ఎన్కౌంటర్ పోలీసులు
English summary
Two terrorists have been reportedly killed in an encounter with security forces in Jammu and Kashmir's Budgam district. The encounter is still underway between security forces and a third terrorist, police said.
Story first published: Monday, January 21, 2019, 13:56 [IST]