తల్లితో గొడవ: మేనల్లుడిని కప్బోర్డులో పెట్టి చంపేసింది
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాస్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ.. తన మేనల్డుడిని దారుణంగా హత్య చేసి, కప్బోర్డులో ఉంచింది. బాలుడి తల్లితో గొడవ పడిన తర్వాత ఈ హత్యకు తెగబడింది నిందితురాలు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లి శంపా బీబీకి, ఆమె దగ్గరి బంధువైన తజ్మీరా బీబీ అనే మహిళతో తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం నుంచి శంపా బీబీ రెండేళ్ల కుమారుడు కనిపించకుండా పోయాడు.
ఈ నేపథ్యంలో శంపా బీబీ, ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తజ్మీరా బీబీ ఇంట్లో సోదాలు చేయగా ఓ కప్బోర్డులో బాలుడి మృతదేహం లభించింది.
కాగా, ఇంట్లోకి వచ్చిన మేనల్లుడిని తజ్మీరా గట్టిగా చెంప మీద కొట్టడంతో అతడు కిందపడి అపస్మారక స్థితిలోకి పోయాడు. తన కుమారుడితో గొడవ పెట్టుకున్నాడనే కోపంతోనే అతడ్ని కొట్టింది. ఆ తర్వాత అతడ్ని ఇంట్లోని కప్బోర్డులో పెట్టింది.
Recommended Video
అల్మారాలో పెట్టి అప్పటికే ఆరు గంటలు కావడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలైన తజ్మీరాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, బాలుడి హత్య ఘటన నేపథ్యంలో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెకలొన్నాయి. దీంతో భారీ పోలీసులు మోహరించారు.