వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనర్హత: 20 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట, సత్యం గెలిచిందని కేజ్రీ
న్యూఢిల్లీ: అనర్హత వేటు పడిన 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై వేసిన అనర్హత వేటును ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఎన్నికల కమిషన్ విధానాలను అనుసరించి, ఒక్కో కేసును పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉండిందని హైకోర్టు అభిప్రాయపడింది.
ప్రజాప్రతినిధులుగా ఉంటూ లాభదాయక పదవులు అనుభవిస్తున్నారనే అభియోగంపై ఎన్నికల కమిషన్ 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించింది. సత్యం గెలిచిందని, ఢిల్లీ ప్రజాప్రతినిధులను అక్రమంగా అనర్హులుగా ప్రకటించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఆ 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో వారి సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. 70 సీట్లు గల ఢిల్లీ శాసనసభలో ఆమ్ ఆద్మీకి 67 మంది సభ్యులున్నారు.
Comments
English summary
The disqualification of 20 AAP MLAs has been cancelled by the Delhi High Court. The court said the Election Commission must hold the proceedings and consider each case by merit.
Story first published: Friday, March 23, 2018, 15:22 [IST]