బాబుకు రాజ్ ఫోన్, బైక్పై చెవిరెడ్డి: తమిళనాట ఆందోళన, దాడులు
విశాఖ/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో జరిగిన ఎన్కౌంటర్ పైన వివరాలు అడిగారు. శేషాచలం ఎన్కౌంటర్లో 20 మంది స్మగర్లు, కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే.
తమిళనాడులో నిరసన
ఎన్కౌంటర్ పైన తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా సంస్థల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జీఎంఆర్ గ్రూప్కు చెందిన టోల్ప్లాజా పైన ఆందోళనకారులు దాడి చేశారు. చెన్నైలోని ఆంధ్రాబ్యాంకు అన్ని శాఖల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు, రాజకీయా పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
తమిళనాడులో నిరసన
ఎన్కౌంటర్ పైన తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా సంస్థల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో నిరసన
జీఎంఆర్ గ్రూప్కు చెందిన టోల్ప్లాజా పైన ఆందోళనకారులు దాడి చేశారు. చెన్నైలోని ఆంధ్రాబ్యాంకు అన్ని శాఖల వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
తమిళనాడులో నిరసన
శేషాచలం అడవుల్లోని ఎన్ కౌంటర్ పైన తమిళనాడులోని రాజకీయా పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
తమిళనాడులో నిరసన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటంతో తమిళనాడులో పార్టీలు, తమిళ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
తమిళనాడులో నిరసన
ఎన్కౌంటర్ పైన తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా సంస్థల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసు
ఎన్కౌటర్ కేసులో జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీటి పైన రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించిందని తెలుస్తోంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు పంపారు.
ద్విచక్ర వాహనం పైన చెవిరెడ్డి
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ద్విచక్ర వాహనం పైన అడవుల్లోకి వెళ్లారు. ఎన్కౌంటర్ మృతులను పరిశీలించారు. కాగా, ఎన్కౌంటర్ పైన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మధ్యాహ్నం దీని పైన విచారణ చేపట్టనున్నారు.