వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2008 జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగుర్ని దోషిగా తేల్చిన కోర్టు, నిర్దోషిగా ఒకరు

|
Google Oneindia TeluguNews

జైపూర్: 2008లో జరిగిన జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించింది.

2008 మేలో జైపూర్‌లో ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ పేలుళ్లలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు.

2008 Jaipur serial blasts case: 4 held guilty, 1 acquitted

మొదట హవామహల్ వద్ద పేలుడు సంభవించింది. ఐదు నిమిషాల తర్వాత మరో ప్రాంతంలో బాంబు పేలుడు జరిగింది. సుమారు ఏడు చోట్ల ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఎక్కువగా పేలుళ్లు హనుమాన్ ఆలయాల వద్దే జరగడం గమనార్హం.

ఈ కేసుకు సంబంధించి 2018 ఫిబ్రవరిలో ముజాహిదీన్ ఉగ్రవాది అరిజ్ ఖాన్ అలియాస్ జునైద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ బాంబు దాడికి పాల్పడిన మరో ఇద్దరిని 2008లోనే ఎన్‌కౌంటర్ చేశారు. 12ఏళ్లపాటు కొనసాగిన విచారణ అనంతరం జైపూర్ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.

English summary
A Jaipur court on Wednesday pronounced its verdict in the 2008 Jaipur serial blasts case convicting four accused while one was acquitted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X