టైమ్స్ నౌ సర్వే: నిన్న కాంగ్రెస్ గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ హవా, కర్ణాటకలో హోరాహోరీ
న్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్లో ఒంటరిగా విజయం సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కానీ బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ హవా, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్
ఈ నేపథ్యంలో వచ్చే లోకసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ హవా ఉంటుందని అందరు భావిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగలనుంది. కేవలం ఛత్తీస్గఢ్లో మాత్రమే ఆ పార్టీకి ప్లస్ కానుంది. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకోనుందని తాజాగా టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 29 లోకసభ స్థానాలు ఉన్నాయి. సర్వే ప్రకారం... ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకోనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 23 సీట్లు గెలుచుకోనుంది. రాజస్థాన్లో 25 లోకసభ స్థానాలకు గాను యూపీఏ 8, ఎన్డీయే 17 సీట్లు గెలుచుకోనుంది. ఛత్తీస్గఢ్లో మాత్రం యూపీఏ 6, ఎన్డీయే 5 సీట్లు గెలుచుకోనుందని తేలింది. మొత్తంగా ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్డీయే 45 సీట్లు గెలుచుకుంటుండగా, కాంగ్రెస్ 20 సీట్లు మాత్రమే గెలవనుంది. అధికారంలో ఉన్న కర్ణాటకలోను బీజేపీ.. కాంగ్రెస్తో పోటీ పడుతోంది. చెరీ 14 సీట్లు గెలుచుకోనున్నారు.
బీజేపీపై వ్యతిరేకత కాదా
ఈ ఫలితాలను బట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో వరుసగా మూడుసార్లు బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఓడిపోయిందని అర్థమవుతోందని అంటున్నారు. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ లేదా నరేంద్ర మోడీలపై వ్యతిరేకత కాదని అర్థమవుతోందని అంటున్నారు.