వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు ప్రమాదం: 21 మంది మృతి, 9మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

21 killed in Himachal bus accident
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్ర రహదారిపై వెళుతుండగా లోయలో పడటంతో బస్సులోని 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 30మంది ఉన్నట్లు తెలిసింది.

ఈ ప్రమాదంలో సిమ్లా జిల్లాలో చోటు చేసుకుంది. సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సిమ్లా నుంచి సవేరాఖడ్‌కు వెళుతుండగా బసంత్‌పూర్ ప్రాంతంలోని కాధర్ ఘాట్ వద్ద బస్సు లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు చేపట్టినట్లు సిమ్లా ఎస్పి డిడబ్ల్యూ నేగి తెలిపారు.

సుమారు 400 మీటర్ల లోతు గల లోయలో బస్సు పడటంతో ఎక్కువ మంది ప్రయాణికులు మృతి చెందారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనను ముందే పసిగట్టిన బస్సు డ్రైవర్ ముందే దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.

గాయాలపాలైన ప్రయాణికులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ జిల్లా అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు భావిస్తున్నారు.

English summary

 At least 21 passengers were killed when a state roadways bus rolled down a hill and fell into a gorge Tuesday in Himachal Pradesh’s Shimla district, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X