డ్రగ్స్ తీసుకొన్నారు. కిడ్నాప్ చేశారు, ఆపై అత్యాచారం చేశారు
డిల్లీలో 21 ఏళ్ళ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. హిమ్మత్, సునీల్ అనే ఇద్దరు కారులో ఆ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. వారి నుండి తప్పించుకొనే క్రమంలో యువతి గాయపడింది.
న్యూఢిల్లీ :దేశ రాజధానిలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. డ్రగ్స్ తీసుకొన్న ఇద్దరు వ్యక్తులు ఓ యువతిని కారులో కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన డిల్లీలోని గురుగ్రామ్ లో బుదవారం రాత్రి చోటుచేసుకొంది.
ఢిల్లీ శివారులోని గురుగ్రామ్ లో 21 ఏళ్ళ యువతిని ఇద్దరు కారులో కిడ్నాప్ చేశారు. ఆమెను తమ ప్లాట్ లోకి తీసుకువచ్చారు. డిల్లీలోని ద్వారక సమీపంలో హరివిహర్ లో ని ప్లాట్ లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే ఆమె తప్పించుకొనేందుకు ప్రయత్నించుకొనే క్రమంలో ఆ యువతి భవనం నుండి జారిపడింది,.ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. అయితే ఆమెను ఆపే ప్రయత్నంలో ఓ నిందితుడు కూడ గాయపడ్డాడు. హిమ్మత్ ,సునీల్ అనే నిందితులు ఆ యువతిపై అత్యాచారం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో హిమ్మత్ గాయపడ్డాడు.
సునీల్ గతంలో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేశాడు. అయితే నిందితులు డ్రగ్స్ తీసుకొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అత్యాచారానికి గురైన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.