ప్రధాని సభలో అపశృతి: 22మందికి గాయాలు, ‘ఆస్పత్రి బెడ్పైనే మోడీని ఆటోగ్రాఫ్ అడిగింది’
Recommended Video
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్లో ఏర్పాటు చేసిన కృషి వికాస్ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా ఓ టెంట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.
క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోడీ.. వారిని పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
బాధితులను అప్యాయంగా పలకరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. గాయపడి ఆస్పత్రి బెడ్పై చికిత్స పొందుతున్న ఓ యువతి.. ప్రధాని రాగానే ఆయన ఆటోగ్రాఫ్ అడగటం గమనార్హం. ఆమె కోరిన వెంటనే ప్రధాని అక్కడే ఆమెకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
కాగా, టెంట్ కుప్పకూలిన ఘటనలో 20 మంది గాయపడటంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మమతా బెనర్జీ చెప్పారు.
Look at the adulation for PM Modi.
— Nikhil Srivastava (@snikhil_social) July 16, 2018
The lady meets first in the hospital asks PM for an autograph while hardly being able to speak.
Needless to say, PM happily obliged.#BengalWithModi pic.twitter.com/Pvr4JPsata
#WATCH Moments after a portion of tent in PM Narendra Modi’s rally in Midnapore collapsed during his speech today. PM later met the injured in hospital. #WestBengal pic.twitter.com/NjvFY7d6Ay
— ANI (@ANI) July 16, 2018