చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతిపై అత్యాచారం.. హత్య.. సున్నితమైన ప్రదేశాల్లోఅతి దారుణంగా.. లవర్ జంప్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఉద్యోగం చెయ్యడానికి చెన్నై చేరుకుని స్నేహితురాలితో కలిసి నివాసం ఉంటున్న యువతి దారుణ హత్యకు గురి కావడంతో ఆమె స్నేహితులు హడలిపోయారు. అయితే హత్యకు గురైన యువతి ప్రేమలో ఉందని, అతను కూడూ ఉద్యోగం కోసం కాంచీపురం వచ్చాడని, ప్రస్తుతం అతను మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు. యువతి వక్షోజాలు, శరీరంలోని సున్నితమైన ప్రాంతాల్లో గోళ్లతో గీచిన గీతలు ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నా భార్య అందంగా ఎందుకు తయారైయ్యింది ?: అక్రమ సంబంధం, అనుమానం, కసితీరి పొడిచి చంపేసి!నా భార్య అందంగా ఎందుకు తయారైయ్యింది ?: అక్రమ సంబంధం, అనుమానం, కసితీరి పొడిచి చంపేసి!

 ఒడిశా అమ్మాయి

ఒడిశా అమ్మాయి

ఒడిశాకు చెందిన కర్న ప్రియదర్శిణి (22) అనే యువతి చెన్నై సమీపంలోని కాంచీపురం చేరుకుని స్నేహితురాలు రంజిత కుమారి సాహు (22)తో కలిసి పడప్పై సమీపంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నది. కర్న ప్రియదర్శిణి, రంజిత కుమారి సాహు కాంచీపురం సమీపంలోని ఒరగడంలోని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

 ఉద్యోగానికి స్నేహితురాలు

ఉద్యోగానికి స్నేహితురాలు

ఉదయం ఎప్పటిలాగే ఉదయం రంజిత కుమారి సాహు ఉద్యోగానికి వెళ్లింది. ఇంటిలో కర్న ప్రియదర్శిణి మాత్రమే ఉంది. సాయంత్రం ఉద్యోగం ముగించుకుని రంజిత కుమారి సాహు ఇంటికి వచ్చింది. ఇంటిలో కర్న ప్రియదర్శిణి నిద్రపోతున్న స్థితిలో దుప్పటి కప్పుకుని కనిపించింది.

 వక్షోజాలు, శరీరం మొత్తం గాయాలు

వక్షోజాలు, శరీరం మొత్తం గాయాలు

ఇంటికి వెళ్లిన రంజిత కుమారి సాహు స్నేహితురాలు కర్న ప్రియదర్శిణిని లేపడానికి ప్రయత్నించింది. అయితే ఎంత సేపటికి కర్న ప్రియదర్శిణి స్పందించకపోవడంతో దుప్పటి తీసి చూసింది. కర్న ప్రియదర్శిణి వక్షోజాలు, కడుపు, యద, చాతితో పాటు శరీరంలోని సున్నితమైన ప్రాంతాల్లో గాయాలు కావడం, ఆమె శరీరం మీద గోళ్లతో గీకారని గుర్తించి కేకలు వేసింది.

 అత్యాచారం, హత్య

అత్యాచారం, హత్య

ఇరుగు పొరుగు వారి సహాయంతో రంజిత కుమారి సాహు తన స్నేహితురాలు కర్న ప్రియదర్శిణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే కర్న ప్రియదర్శిణి మరణించిందని వైద్యులు చెప్పారు. కర్న ప్రియదర్శిణి మీద దాడి చేసి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని, మెడ మీద బలమైన చేతితో గీచిన గీతలు ఉన్నాయని వైద్యుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

17 మందితో షాపింగ్ మాల్ లో సెక్స్ రాకెట్
 ప్రియుడు మాయం

ప్రియుడు మాయం

పెర్షాంపూర్ ప్రాంతంలోనీ మీరామ్ కు చెందిన మనీష్ తో కర్న ప్రియదర్శిణి ప్రేమలో ఉందని మణిమంగళం పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మనీష్ ప్రస్తతం షోలింగంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, అయితే కర్న ప్రియదర్శిణి హత్యకు గురైన తరువాత మనీష్ మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు. మనీష్ తన ప్రియురాలు కర్న ప్రియదర్శిణి మీద అత్యాచారం చేసి హత్య చేశాడా ? లేక తెలిసిన వాళ్లు ఆమెను పక్కాప్లాన్ తో హత్య చేశారా ? దుండుగులు ఏమైనా హత్య చేశారా ? అనే కోణంలో మణిమంగళం పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
22 year old north indian young girl murder near kancheepuram near Chennai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X