వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దలను ఒప్పించి.. ఆ యువతి శ్రీకృష్ణుడినే పెళ్లాడింది!

మధ్యప్రదేశ్ లోని టికంగడ్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కృష్ణుడి భక్తురాలైన ఓ వికలాంగ యువతి ఏకంగా ఆయన విగ్రహాన్నే వివాహం చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

భోపాల్‌: మధ్యప్రదేశ్ లోని టికంగడ్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కృష్ణుడి భక్తురాలైన ఓ వికలాంగ యువతి ఏకంగా ఆయన విగ్రహాన్నే వివాహం చేసుకుంది. మొదట కుటుంబసభ్యులు వ్యతిరేకించినా.. ఆ తర్వాత అంగీకరించడంతో ఈ వివాహం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. టికంగఢ్‌ జిల్లాకి చెందిన శాలిని అనే 22 ఏళ్ల యువతి అంధురాలు. చిన్నప్పటి నుంచి ఆమెకు రామాయణం, భగవద్గీతల కథలు వినడం అలవాటు. వికలాంగురాలైన శాలిని చిన్నప్పటి నుంచి కృష్ణుడిని కొలుస్తుండడంతో శాలినిలో ఏదో తెలీని శక్తి ఉందని నమ్మిన గ్రామస్థులు ఆమెను ఎంతగానో గౌరవించేవారు.

22 years old blind girl weds idol of Lord Krishna

ఉన్నట్టుండి శాలిని తానెంతగానో కొలిచే కన్నయ్యని వివాహం చేసుకుంటానని తండ్రి మున్నాలాల్‌కి చెప్పింది. కూతురి ఇష్టాన్ని కాదనలేక వెంటనే మున్నాలాల్‌ ఓ పూజారిని పిలిపించి డిసెంబర్‌ 4న ముహూర్తం పెట్టారు. ఊరు ఊరంతా తరలివచ్చి సాధారణ వివాహాలలాగే పెళ్లికి ముందు మెహెందీ, సంగీత్‌ కార్యక్రమాలు కూడా జరిపించారు.

అంతేగాక, వరుడి తరఫున వధువు ఇంటికి బంధుమిత్రులు ఊరేగింపుగా వెళ్లారు. డిసెంబర్‌ 4న వివాహ పంచమి కావడంతో అదే రోజున కృష్ణుడి ఆలయంలో విగ్రహానికి, శాలినికి పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం శాలిని ఇప్పుడున్న ఇంట్లోనే ఉంటుందని ఆమె తండ్రి మున్నాలాల్‌ తెలిపారు. ఇంట్లో శాలినికి ఉన్న ప్రత్యేక గదిని ఓ ఆలయంలా మార్చారు.

English summary
A 22-year-old visually challenged girl, who has been a staunch devotee of Krishna since childhood, married an idol of the Hindu god at a village in Tikamgarh district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X