దారుణం: గర్భిణిపై గ్యాంగ్ రేప్, ఆ నీళ్ళే ఆమె కొంపముంచాయి
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సమీపంలోని గురుగ్రామ్ లో గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో దారుణ ఘటన చోటు చేసుకొంది. మనేసర్ లో 23 ఏళ్ళ గర్భిణి ఆసుపత్రిలో భర్తతో కలిసి చెకప్ కోసం ఈ నె 21 వతేదిన వెళ్ళింది. భర్తతో కలిసి సైకిల్ పై వెళ్ళింది.
అయితే ఆసుపత్రిలో చెకప్ చేయించుకొన్న తర్వాత ఇంటికి బయలుదేరారు. అయితే సైకిల్ ఇంటికి వెళ్ళే సమయంలో సైకిల్ తాను ప్రయాణించడం కష్టంగా ఉందని బాధితురాలు భర్తకు చెప్పింది. దీంతో ఆమెను ఆటోలో ఎక్కించి తాను సైకిల్ పై ఇంటికొచ్చాడు.
గర్భిణిపై గ్యాంగ్ రేప్
సైకిల్ పై ఇంటికి వెళ్ళేందుకు ఇబ్బందిగా ఉన్న భార్యను ఆటోలో రావాలని భర్త ఆమెను ఆటోలో ఎక్కించాడు. అయితే తాను సైకిల్ పై ఇంటికి తిరిగి వచ్చినా కూడ తన భార్య రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే బాధితురాలిని గమ్యస్థానం చేర్చకుండా నిందితులు మధ్యలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు కూడ ఆమెపై అత్యాచారం చేశారు.
ఆటో డ్రైవర్ ప్లాన్
గర్భిణిని ఆటో డ్రైవర్ నమ్మించాడు ఆటోలో ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూర్చొన్నారు. అయితే ఆటో డ్రైవర్ బాధితురాలికి ఓ సీసాలో మంచినీళ్ళు ఇచ్చాడు. అయితే ఆ నీళ్ళు తాగిన వెంటనే బాధితురాలు స్పృహ కోల్పోయింది. దీంతో నిందితులు ముగ్గురు ఆమెపై గ్యాంర్ రేప్ కు పాల్పడ్డారు.
పోలీసుల దర్యాప్తుతో ఇలా
భార్య నేరుగా ఇంటికి రాకపోవడంతో భర్త పోలీసులకు పిర్యాదు చేశాడు దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు. దీంతో ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు బాధితురాలిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని తేలింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బీహార్ వాసులు
బాధితురాలు బీహర్ నుండి వలసవచ్చారు. గురుగ్రామ్ లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బాధితురాలికి ఇంతకుముందే ఓ కొడుకు ఉన్నాడు. అయితే మరోసారి ఆమె గర్భం దాల్చింది. పరీక్షల నిమిత్తం వెళ్ళిన గ్యాంగ్ రేప్ కు గురైంది.