కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: హోటల్లో విద్యార్థిపై దుండగులు కాల్పులు..
అమెరికాలో దారుణం జరిగింది. పై చదువుల కోసం వెళ్లిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన అభిషేక్ సుదేశ్ భట్ కాలిఫోర్నియా వెళ్లాడు. ఎంఎస్ చదువుతున్నాడు. అక్కడే ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. పనిచేసే చోట అతనిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అభిషేక్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాలిఫోర్నియాలోని స్టేట్ యూనివర్సిటీ నుంచి అభిషేక్ సుదేశ్ భట్ ఎంఎస్ చేస్తున్నారు. హోటళ్లో పనిచేస్తూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. అయితే హోటల్లో పనిచేసే సమయంలో గురువారం ఉదయం యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అభిషేక్ అక్కడికక్కడే నెలకొరిగారు. తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. అభిషేక్పై ఎవరు కాల్పులు జరిపిందనే అంశంపై క్లారిటీ రాలేదు.
అభిషేక్ తర్వాత షిప్ట్ వచ్చిన వ్యక్తి దారుణం గురించి అతని కజిన్ శ్రీవాత్సవ తెలిపారు. అయితే న్యాయ ప్రక్రియ పూర్తి చేసేందుకు సమయం పట్టడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అభిషేక్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవారం వస్తుందని అధికారులు తెలియజేశారు.
ఫోరెన్సిక్ నివేదికతో సంబంధం లేకుండా.. అభిషేక్ అంత్యక్రియలు నిర్వహిస్తామని శ్రీ వాత్సవ తెలిపారు. అభిషేక్ పేరెంట్స్ వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అభిషేక్ మృతికి సంబంధించి న్యాయ ప్రక్రియ పూర్తిచేయాలని కుటుంబసభ్యులు కాలిఫోర్నియా, భారత ఎంబసీ, కర్ణాటక అధికారులను కోరారు.