వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్రంలో 255 ఏళ్లవరకు మనుషులు బ్రతుకుతున్నారా ..!? అంతా ఎన్నికల సంఘం ఘనత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్నికల సందర్భంగా చిత్ర విచిత్ర సిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో వయోజనులకు ప్రముఖుల పేర్లు, కూరగాయాలు, పండ్ల పేర్లతో ఓటర్ల జాబితా విడుదలై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. ఈ సారి ఎన్నికల సంఘం మరో రికార్డు సృష్టించింది. పంజాబ్ రాష్ట్రంలో ఏకంగా 273 మంది వయోజనుల వయస్సు 118 ఏళ్లు నిర్ధారించి తప్పులో కాలేశారు.

<strong>ముద్రతో ఉపాధి పొందిన వారి వివరాల వెల్లడికి కోడ్ అడ్డంకి .. ఎన్నికల తర్వాతే డేటా</strong>ముద్రతో ఉపాధి పొందిన వారి వివరాల వెల్లడికి కోడ్ అడ్డంకి .. ఎన్నికల తర్వాతే డేటా

వందేళ్లు దాటిన వారు వందల సంఖ్యలో ..

వందేళ్లు దాటిన వారు వందల సంఖ్యలో ..

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఎక్కడో జరిగే చిన్న పొరపాటు వల్ల ఈసీకి చెడ్డపేరు తీసుకొస్తుంది. పంజాబ్ తో పాటు ఇతర నగరాల్లో కూడా శతాధిక వయస్సు కలిగిన ఓటర్లు ఉన్నారని సెలవిచ్చింది ఈసీ. అమృత్ సర్ లో 558, హోషియార్ లో 449 మంది ఉండగా ... పంజాబ్ లోని లుథియానాలో 273 మంది శతాధిక వృద్ధులు ఉన్నట్టు తెలిపింది.

సాక్షాత్తు సీఈసీ సెలవిచ్చారు .. మరీ

సాక్షాత్తు సీఈసీ సెలవిచ్చారు .. మరీ

సాధారణంగా తప్పులు జరుగుతుంటాయి. వాటిని సరిచూసుకోవాలి. కానీ పంజాబ్ రాష్ట్రంలో 5 వేల 916 మంది ఓటర్ల వయస్సు గల వారు ఉన్నారని ఏకంగా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్కే రాజు తెలిపారు. లుథియానా జిల్లాలో ఉన్న 57 మంది శతాధిక ఓటర్లను బూత్ అధికారులతో పరిశీలన చేయించగా వారిలో 35 మంది చనిపోయారని తెలిసింది.

వామ్మో 255 ఏళ్లా ?

వామ్మో 255 ఏళ్లా ?

లుథియానాకు చెందిన అక్షిత్ థావన్, గిల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన అశ్వనీకుమార్ వయస్సు ఓటర్ల జాబితాలో 255 ఏళ్లని అధికారులు పేర్కొన్నారు. లుథియానాకు చెందిన శారదాదేవి 1874లో జన్మించిందని ఓటర్ల జాబితాలో అధికారులు పేర్కొన్నారు. అంటే ఆమె వయస్సు 145 ఏళ్లు .. దీనిపై ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే .. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ అగర్వాల్ చెప్పారు. వాటిని పరిశీలించి సరిదిద్దుతామని వెల్లడించారు.

 2000 బదులు 1900

2000 బదులు 1900

273 మంది ఓటర్ల వయస్సు 118 ఏళ్లని ఓటర్ల జాబితాలో చేరిందని, కానీ వాస్తవానికి అది కొత్తగా నమోదైన ఓటర్ల లిస్ట్ అని తెలిపారు. కొత్త ఓటర్లు 2000 సంవత్సరంలో జన్మించగా, వారు 1900 ఏడాదిలో జన్మించినట్టు తప్పుగా నమోదు చేయడంతో జాబితా తప్పుల తడకగా మారింది.

English summary
In Punjab, 273 adults aged between 118 and 11 years have been wrong and confirmed by the Election Commission officials. In addition to Punjab and other cities, there are voters who are about a hundred years old. 555 in Amritsar and 449 in Hoshiar. There are 5, 916 voters in the state, according to the state electoral officer SK King. The 57-year-old voters in Ludhiana district were examined by booth officers, killing 35 of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X