నిద్రమత్తులో డ్రైవర్.. కాల్వలో పడిపోయిన బస్సు.. 29 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సు కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 29 మంది ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. యూపీ రవాణాశాఖకు చెందిన స్లీపర్ కోడ్ బస్సు యమునా ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వస్తూ 15 అడుగుల లోతున్న డ్రైనేజీ కాలువలో పడిపోయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
ప్రమాదంలో 29మంది మృతి చెందగా.. మరో 20 మంది ప్యాసింజర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు అన్ని రకాల సహాయసహకారాలు అందించాలని కలెక్టర్ను ఆదేశించారు.
#UPDATE 29 persons dead after a bus carrying around 40 passengers fell into 'jharna nalla' on Yamuna Expressway in Agra. Rescue operation underway. pic.twitter.com/mAnY9pUsgX
— ANI UP (@ANINewsUP) July 8, 2019
UP: 29 dead as bus falls into drain on Yamuna Expressway
— ANI Digital (@ani_digital) July 8, 2019
Read @ANI story | https://t.co/DRSptaQLqk pic.twitter.com/RDb7yV64z0