29 ఏళ్ళ మహిళపై కత్తితో దాడి, మాజీ భర్తే కారణమా ?
గురువారం రాత్రి ముంబాయిలో 29 ఏళ్ళ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆమె చాతీపై కత్తిపోట్లు అయ్యాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ముంబాయి :ముంబాయిలో 29 ఏళ్ళ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కత్తితో ఆమె చాతీపై పొడిచారు. స్థానికులు గుర్తించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.నిందితులు ఎవరనేది ఇంకా గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. భర్తను వదిలేసి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొంది ఆ యువతి.
29 ఏళ్ళ మహిళ తన భర్తతో విడాకులు తీసుకొంది. తన కొడుకుతో వేరుగా జీవనం సాగిస్తోంది. అయితే భర్తతో దూరమైన తర్వాత 22 ఏళ్ళయువకుడితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంబంధం నేపథ్యంలో దాడి జరిగిందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తన విధులను ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్థోంది. అయితే ఆమెను కలుసుకొనేందుకు ఆమెతో సంబంధం ఏర్పర్చుకొన్న యువకుడు రావాల్సి ఉంది.
అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఏడున్నరగంటల సమయంలో మహలక్ష్మీ రేస్ కోర్స్ సమీపంలో ఆమెపై కత్తితో దాడి చేశారు. ఆమె చాతీపై కత్తితో గాయపర్చారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆమెతో సంబంధం ఏర్పర్చుకొన్న యువకుడు వచ్చాడు ఆమెకు కత్తిపోట్లు అయిన విషయాన్ని గుర్తించి ఆసుపత్రిలో చేర్చాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.