ఘోరం: ముగ్గురు కీచకులు.. నర్సును పొదల్లోకి లాక్కెళ్లి...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతున్న ఓ నర్సును ముగ్గురు యువకులు పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహికంగా అత్యాచారం జరిపారు.
బరేలీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతున్న ఓ నర్సును ముగ్గురు యువకులు పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహికంగా అత్యాచారం జరిపారు.
ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది. బరేలీలోని రోహిల్ ఖండ్ వైద్యకళాశాల ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సు విధులు ముగించుకుని గురువారం ఆర్థరాత్రి ప్రాంతంలో ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది.
పాఠశాల ప్రిన్సిపాల్.. పాడు పని! పాఠశాలలోనే మద్యం తాగి ఓ బాలికపై..
ముగ్గురు యువకులు జై నారాయణ్ స్కూల్ వద్ద ఆమెను అడ్డగించి, సమీపంలో ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత నర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించామని ఎస్పీ రోహిత్ సింగ్ చెప్పారు.
విద్యార్థి ఘాతుకం: రన్నింగ్ బస్సులో.. అందరూ చూస్తుండగానే.. ప్రయాణికుడి గొంతు కోసి..
ఈ కేసులో నిందితులైన జీతు కశ్యప్, బికాస్, హరిద్వారిలను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్పీ వివరించారు. నిందితులు ముగ్గురికీ నేర చరిత్ర ఉందని, వీరిలో జీతు కశ్యప్ ఓ లూటీ కేసులో బెయిల్ పై విడుదలై వచ్చాడని చెప్పారు.