వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండో-మయన్మార్ బార్డర్: అంబుష్ పేల్చడంతో ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని భారత్-మయన్మార్ దేశాలకు సరిహద్దుగా ఉన్న ఛందేల్ జిల్లాలో అనుమానిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మిలిటెంట్లు పేల్చిన అంబుష్ ఘటనలో ముగ్గురు అస్సామ్ రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఇండో-మయన్మార్ సరిహద్దు ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఖోంగ్టల్ వద్ద పహారా కాస్తున్న సమయంలో బుధవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లు అంతర్జాతీయ సరిహద్దులో విధుల నిర్వహించి వస్తున్న సమయంలో మిలిటెంట్లు ఈ ఘాతుకానికి తెగబడ్డారని అధికారులు తెలిపారు.

3 Assam Rifles Personnel Killed, 5 Injured in Ambush along India-Myanmar Border

బేస్ క్యాంపునకు రెండు కిలోమీటర్ల దూరంలోని సాజిక్ టాంపక్ గ్రామం వద్దకు రాగానే ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో హవిల్దార్ ప్రణయ్ కలిట, రైఫిల్ మ్యాన్ వైఎం కోన్యక్, రైఫిల్ మ్యాన్ రతన్ సలీమ్ మృతి చెందారు. గాయపడిన మరో ఐదుగురు జవాన్లను మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Recommended Video

New National Education Policy 2020: 5+3+3+4 System, New Exams Pattern || Oneindia Telugu

ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇప్పటి వరకు ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు. అయితే, ఈ పని చేసింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)పై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అస్సామ్ రైఫిల్స్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

English summary
At least three Assam Rifles personnel were killed and five others injured in an ambush by suspected People's Liberation Army (PLA) militants in Manipur’s Chandel district along India-Myanmar border on Wednesday night, according to initial reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X