3 కోట్ల మంది ఒకటిన్నర కోట్ల ప్రజలే పన్ను చెల్లిస్తే ఎలా: ప్రధాని మోడీ ప్రశ్న
దేశాభివృద్ధి కోసం పౌరులు పన్ను చెల్లించాలని ప్రధాని మోడీ కోరారు. పన్నులతో సమకూరే ఆదాయంతో ప్రభుత్వానికి మేలు చేస్తోందని పేర్కొన్నారు. అయితే గతేదాడి 3 కోట్ల మంది పౌరులు విదేశాలకు వెళ్లారని.. కానీ 1.5 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లించారని గుర్తుచేశారు. దీంతో దేశాభివృద్ధి స్తంభించిపోతోందని తెలిపారు.
వివిధ పనుల కోసం , వ్యాపారం నిమిత్తం, పర్యటన కోసం దాదాపు 3 కోట్ల మంది వెళ్లారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఉంటే కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే ప్రజలు పన్ను చెల్లిస్లే.. సంక్షేమ పథకాలు నిధులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. 'టైమ్స్ నౌ' సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
అయితే దేశంలో 2200 మంది ప్రజలు తమ ఆదాయం రూ.కోటి అని ప్రకటించడం నమ్మశక్యంగా లేదన్నారు. పన్ను చెల్లింపుదారులకు భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారిపై ప్రభుత్వం ఫోకస్ చేసిందని మోడీ చెప్పారు.
కొందరు ఎలా పన్ను చెల్లించొద్దు అని శోధిస్తున్నారని గుర్తుచేశారు. ఆదాయపు పన్ను సరిగా కట్టకపోవడంతో.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని.. దీంతో పన్ను చెల్లించేవారికి ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.