రాష్ట్రపతి భవన్లో నల్ల త్రాచు.. పట్టుకున్న సిబ్బంది
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వర్షాలు సమృద్ధిగా కురుస్తోన్నాయి. వానలతో పాములు కూడా బయటకొస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రపతి భవన్లోకి ఓ పాము వచ్చింది. దీంతో హైరానా పడ్డ సిబ్బంది .. వెంటనే పాములను పట్టేవారిని పిలిపించారు. వెంటనే వచ్చిన వారు మూడడుగుల నల్ల త్రాచును పట్టుకొన్నారు. దీంతో అక్కడున్న సిబ్బంది హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రపతి భవన్ గేట్ నంబర్ 8 వద్దగల సెక్యూరిటీ క్యాబినె్ వద్ద పాము కనిపించింది. 3 అడుగుల త్రాచు పాము కావడంతో అక్కడున్న సిబ్బంది భయపడ్డారు. వెంటనే ఎన్జీవో సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు రంగప్రవేశం చేసి పామును బంధించారు. ఇటీవల ఢిల్లీ సమీపంలో వర్షాలు కురుస్తుండటంతో పాములు బయటకు వస్తున్నాయని వైల్డ్ లైఫ్ ఎస్ వో ఎస్ డిప్యూటీ డైరెక్టర్ వసీం అక్రం. సెక్యూరిటీ గది వద్ద పాము చొరబడిందని వసీం పేర్కొన్నారు. దీంతో తమ సిబ్బంది రంగంలోకి కాపాడారని తెలిపారు. దానిని పట్టుకొని .. అరణ్యంలో వదిలేశామని వివరించారు.