ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల హతం, పుల్వామాలో ఇంటర్నెట్ నిలిపివేత...
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. కంగన్ ప్రాంతానికి భారత సైన్యం 55 రైఫిల్స్, 183 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భద్రతా సిబ్బందిని చూసిన.. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఫైర్ స్టార్ట్ చేశారు.
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం..అమరులైన కల్నల్తో సహా మరో నలుగురు
Recommended Video
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్కు చెందిన ఉగ్రవాదులు చనిపోయారు. మృతిచెందిన ఉగ్రవాదులను నిర్దారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల మృతితో కశ్మీర్ లోయలో అశాంతి సృష్టించేందుకు అల్లరిమూకలు ప్రయత్నిస్తారని భావించి చర్యలు తీసుకున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కూడా ఆడపా దడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.