వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ ఎన్‌కౌంటర్: హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి దెబ్బ

దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా ఈ ఉగ్రమూకలకు గట్టి నెట్ వర్క్ ఉన్నప్పటికీ బుధవారం రాత్రి సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసు బలగాలు భారీ ఎన్‌

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా ఈ ఉగ్రమూకలకు గట్టి నెట్ వర్క్ ఉన్నప్పటికీ బుధవారం రాత్రి సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసు బలగాలు భారీ ఎన్‌కౌంటర్ జరిపాయి.

ఆరు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఓ సైనికాధికారికి గాయాలయ్యాయి.

3 Lashkar Terrorists Killed, Army Officer Injured In Gunbattle In South Kashmir's

పుల్వామాలోని కాకపొరా ప్రాంతంలో ముగ్గురు యువకులు లష్కరే తోయిబాలో చేరినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో భద్రతా దళాలు, పోలీసులు బుధవారం సాయంత్రం సంయుక్తంగా గాలింపు మొదలుపెట్టారు.

అత్యంత జనసమ్మర్దం గల ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్టు గుర్తించారు. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఎట్టకేలకు సైనికులు గురువారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే 47, ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. కాగా మూడు రోజుల్లో హిజ్బుల్ ఉగ్రవాదులపై సైన్యం ఆపరేషన్ విజయవంతం కావడం ఇది రెండోసారి.

English summary
Security forces killed three Lashkar-e-Taiba terrorists today in an encounter in Pulwama district located in Southern Kashmir. An Army officer was also injured during the six-hour operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X