భారీ ఎన్కౌంటర్: హిజ్బుల్ ముజాహిదీన్కు గట్టి దెబ్బ
దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా ఈ ఉగ్రమూకలకు గట్టి నెట్ వర్క్ ఉన్నప్పటికీ బుధవారం రాత్రి సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసు బలగాలు భారీ ఎన్
శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా ఈ ఉగ్రమూకలకు గట్టి నెట్ వర్క్ ఉన్నప్పటికీ బుధవారం రాత్రి సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసు బలగాలు భారీ ఎన్కౌంటర్ జరిపాయి.
ఆరు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఓ సైనికాధికారికి గాయాలయ్యాయి.
పుల్వామాలోని కాకపొరా ప్రాంతంలో ముగ్గురు యువకులు లష్కరే తోయిబాలో చేరినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో భద్రతా దళాలు, పోలీసులు బుధవారం సాయంత్రం సంయుక్తంగా గాలింపు మొదలుపెట్టారు.
అత్యంత జనసమ్మర్దం గల ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్టు గుర్తించారు. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఎట్టకేలకు సైనికులు గురువారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే 47, ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. కాగా మూడు రోజుల్లో హిజ్బుల్ ఉగ్రవాదులపై సైన్యం ఆపరేషన్ విజయవంతం కావడం ఇది రెండోసారి.