గర్ల్పై ఒకరు రేప్, వీడియో తీసి బెదిరించిన ఫ్రెండ్స్
ఇండోర్: ఒక దళిత మైనర్ బాలికను అసభ్యంగా వీడియో తీయడంతో పాటు, ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో ముగ్గురి పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుల్లో ఒకరి పైన అత్యాచారం కింద కేసును నమోదు చేశారు. లాసుదియా పోలీసు స్టేషన్ ఇంఛార్జ్ నరేంద్ర గహర్వార్ వారిని అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు.
సూరజ్ (20), దీపేష్ (21), రితేష్ (22)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలైన పదిహేడేళ్ల బాలిక ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి పైన కిడ్నాప్ తదితర కేసులు పెట్టారు. దీపేష్ పైన అదనంగా సెక్సువల్ చార్జెస్ నమోదు చేశారు.
మైనర్ బాలిక
బాధిత బాలిక తన ఫిర్యాదులో... తాను జనవరి 30న కోచింగ్ క్లాస్కు వెళ్తున్న సమయంలో తనకు తెలిసిన ఈ నిందితులు ముగ్గురు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు అని చెప్పి తీసుకు వెళ్లారని పేర్కొంది.
మైనర్ బాలిక
వారు తనను ఓ ఇంటికి తీసుకు వెళ్లారని, అక్కడే దీపేష్ ఆమె పైన అత్యాచారం చేశాడని బాధిత మైనర్ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
మైనర్ బాలిక
ఆ సమయంలో రితేష్, సూరజ్లు దానిని వీడియో తీశారు. అసభ్యకరమైన వీడియోలు తీసిన వారు అంతటితో ఆగలేదు. ఆ వీడియోను చూపించిన రితేష్ రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
మైనర్ బాలిక
లేదంటే కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించాడు. అంతేకాదు ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాలిక, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.