ఉద్దవ్ చేసిన తప్పులు ఇవే.. ముఖ్యంగా మూడు మిస్టేక్స్
మహారాష్ట్రలో అఘాడి కూటమి కూలింది. అందుకు గల కారణాలు చాలానే ఉన్నాయి. కానీ మూడు ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. షిండే తిరుగుబాటు.. అణచివేయడంలో ఉద్దవ్ విఫలం అయ్యారు. ఆయన స్మూత్గా ఉండటమే అందుకు కారణం.. ఉద్దవ్ వైఫల్యానికి గల కారణాలను ఓసారి పరిశీలిద్దాం.
శివసేన అంటే మహారాష్ట్రీయుల కోసం ఆవిర్భవించిన పార్టీ. దాని వ్యవస్థాపకులు బాలసాహెబ్.. అదే బాల్ థాకరే అంటే ముస్లింలకు హడల్. కానీ ఉద్దవ్ మాత్రం మెతక వైఖరి. బాల్ ధాకరే చాలా అగ్రెసివ్, ధైర్యంగా ఉండేవాడు. ప్రత్యర్థులను బెదిరించడానికి తాను టైగర్ అని చెప్పేవారు. అతనికి ఏ సందర్భంలో ఎలా నడచుకోవాలో తెలుసు.
1980లో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. బాల్ థాకరే ఇందిరాగాంధీ ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు సౌమ్యంగా ఉండి పరిస్థితిని ఫేస్ చేశాడు. అలా బాల్ థాకరే ప్రభుత్వాల వెనక ఉండి.. మరింత శక్తిమంతుడు అయ్యాడు. ఉద్దవ్ థాకరే మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.. ప్లెక్సిబుల్గా కనిపించడు. 2014 తర్వాత మోడీ పాలన తీరును చదివి ఉటే బాగుండేది.
మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. అనూహ్యంగా సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు. అయితే అంతే అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ రాజ్ భవన్లో వీరిద్దరీతో ప్రమాణం చేయించారు.