వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుండగుల భీభత్సం: ముగ్గురు దొంగలు అంతం

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ లో దొంగలు రెచ్చిపోవడంతో గ్రామస్తులు తిరగబడ్డారు. ముగ్గురు దొంగలను పట్టుకుని చితకబాది దారుణంగా చంపేశారు. మధ్యప్రదేశ్ లోని మాందాపూర్ గ్రామంలో ఆదివారం అర్దరాత్రి చోరీకి ప్రయత్నించిన దొంగలను గ్రామస్తులు గుర్తించారు. వెంటనే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

తమను అడ్డుకుంటున్నారని సహనం కొల్పోయిన దొంగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బాలుడితో సహ ఐదు మందికి తీవ్రగాయాలైనాయి. ఈ సమయంలో దిక్కుతోచని గ్రామస్తులు ముగ్గురు దొంగలను పట్టుకుని అక్కడికక్కడే దారుణంగా కొట్టి చంపేశారు.

3 robbers allegedly beaten to death by residents of a village in Mandsaur in Madhya Pradesh

విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దొంగలు చోరీ చెయ్యడానికి ప్రయత్నించి గ్రామస్తుల మీద కాల్పులు జరిపారని, అందుకే ఇంత జరిగిందని జిల్లా ఎస్పీ మనోజ్ శర్మ తెలిపారు.

గ్రామస్తుల మీద దుండగులు కాల్పులు జరపడం, అందులో ఓ చిన్నారి ఉండటంతో గ్రామస్తులు సహనం కొల్పోయారని మనోజ్ శర్మ వివరించారు. దుండగులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గాయాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్పీ మనోజ్ శర్మ తెలిపారు.

English summary
3 robbers allegedly beaten to death by residents of a village in Mandsaur, 5 villagers,including a child,also injured in firing by robbers in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X