కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు : ట్రక్కులో ఆయుధాల తరలింపు, ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సరిహద్దు గుండా చొరబడేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా జమ్ముకశ్మీర్-పంజాబ్ సరిహద్దు గుండా వెళ్తున్న ఉగ్ర మూకలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జమ్ముకశ్మీర్ ఐజీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్ పంజాబ్ సరిహద్దు ప్రాంతం లఖాన్ గుండా ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారు. వారి ట్రక్కులో భారీగా ఆయుధాలు కూడా ఉన్నాయి. తనిఖీలు చేపట్టారు. వారిలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారని .. వారి నుంచి ఆరు ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామని జమ్ముకశ్మీర్ ఐజీపీ ముఖేశ్ సింగ్ పేర్కొన్నారు. ట్రక్కులో వారు ఆయుధాలు తరలిస్తున్నారని తెలిపారు.
ఇవాళ ఉదయం 8 గంటలకు వారిని జమ్ము పఠాన్కోట్ హైవే వద్ద పట్టుకొన్నామని పేర్కొన్నారు. ఆ ట్రక్కు పంజాబ్ోని బమ్యాల్ ప్రాంతం నుంచి కశ్మీర్ వస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతుందని వివరించారు.