300 బ్యారికేడ్లు సహా 17 వాహనాలు ధ్వంసం.. ఢిల్లీలో హై టెన్షన్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. రద్దు చేయాలని పదే పదే కోరుతున్న కేంద్రం పెడచెవిన పెట్టింది. గత 60 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్త పరిస్థతికి దారితీసింది. తమ డిమాండ్ నెరవేర్చాలని రైతులు/ రైతు ప్రతినిధులు కదం తొక్కారు.
మంగళవారం జరిగిన ఘర్షణలో 80 పై చిలుకు మంది పోలీసులు గాయపడ్డారు. 300 బ్యారికేడ్లను ధ్వంసం చేశారు. నాలుగు కంటైయినర్లు.. 17 ప్రజా రవాణా వాహనాలను ధ్వంసం చేశారు. ఢిల్లీలో జరుగుతోన్న హింసతో దేశం ఉలిక్కిపడింది. రైతులు ఇలా చేస్తారా అని కొందరు రాజకీయ నేతలు అడుగుతున్నారు. చెప్పిన రూట్ మ్యాప్ కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చి.. బీభత్సం సృష్టించారు.
Recommended Video
ఎర్రకోటపై తమ జెండా ఎగరవేసి.. నిరసన తెలియజేశారు. అయితే దీనిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రైతు నేతుల చేసిన ఆందోళనలకు సంబంధించి ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. పండవ్ నగర్, సీమపురి, ఘాజిపూర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. రైతు నేతలు చేసిన ఆందోళనతో దేశం ఒక్కసారికి ఉలిక్కిపడింది. ఏం జరిగింది అని ముక్కున వేలుసుకుంది. రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని కూడా కోరుతోంది.