బెంగళూరులో మహిళ మీద గ్యాంగ్ రేప్, దారుణ హత్య, బండరాళ్లతో తల, కడుపు!
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆమెను అతిదారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరు నగర శివార్లలోని బ్యాడరహళ్ళి సమీపంలోని పైప్ లైన్ ప్రాంతంలో మహిళ హత్యకు గురైయ్యింది.
ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత సుమారు 32 ఏళ్ల మహిళ మీద బ్యాడరహళ్ళిలోని పైప్ లైన్ ప్రాంతంలో సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆమె తల, కడుపు మీద బండరాళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారైనారు.
సోమవారం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాడరహళ్ళి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన మహిళ దుస్తులు అస్తవ్యస్థం అయ్యాయని, ఆమె పేరు, వివరాలు తెలియడం లేదని పోలీసులు చెప్పారు. మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.