విషాదం: ఎయిమ్స్ 4వ అంతస్తు నుంచి దూకి జర్నలిస్ట్ ఆత్మహత్య..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిన ఓ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న కోవిడ్ నోడల్ ఆస్పత్రి ఎయిమ్స్ భవనం నుంచి దూకాడు. నాలుగో అంతస్తు నుంచి దూకడంతో చనిపోయాడు. అతనిని వెంటనే ఐసీయూకు తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలు కావడంతో అతను చనిపోయాడు.
భజన్పురకు చెందిన జర్నలిస్టు.. దైనిక్ భాస్కర్లో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన గత నెల 24వ తేదీన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు.
కానీ గత రెండురోజుల నుంచి అతను డిప్రెషన్కు గురైనట్టు తెలుస్తోంది. జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా తయారైందని.. కొలీగ్స్కు మేసేజ్ పెట్టాడని పోలీసులు తెలిపారు. డిప్రెషన్కు లోనై సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జర్నలిస్టు ఆత్మహత్యతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.