వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కశ్మీర్‌లో బస్సు ప్రమాదం...35 మంది మృతి...

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశ్మీర్‌లోని కేశ్వాన్ ప్రాంతం నుండి కిష్టావర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు లోయలో పడింది. దీంతో 35 మంది మృత్యువాత పడ్డారు..మరో ఇరవైమందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు..కాగా బస్సు ఓవర్ లోడ్‌తో వెళ్లడం వల్లే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

అందమైన కశ్మర్ లోయ ప్రాంతం ఒక్కసారిగా హహాకారాలకు లోనైంది..ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో 50మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సులో లోయపడింది..దీంతో 33 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు..గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి చేర్చారు..కాగా గాయపడిన వారిలో మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు..ఇప్పటివరకు 25 వరకు మృత దేశాలను వెలికి తీసినట్టు జమ్ము కశ్మీర్ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు..అయితే బస్సు ఓవర్ లోడ్ తో వెళ్లడం వల్లే ప్రమాదానికి గురైనట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

35 Killed, a mini bus fell into a gorge in Jammu and Kashmir

ఇక ప్రమాద ఘటనపై హోంమంత్రి అమీత్ షా తీవ్ర దిగ్బాంత్రిని వ్యక్తం చేశారు.క్షతాగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహాబుబా ముఫ్తిలు ఘటనపై విచారం వ్యక్తం చేశారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

English summary
Thirty three people have been killed and 22 injured after a mini bus fell into a gorge in Jammu and Kashmir's Kishtwar district this morning. The bus, which was on its way from Keshwan to Kishtwar, veered off the road and fell into the gorge at Sirgwari around 7:30 am
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X