coronavirus: మహారాష్ట్రలో ఒక్కరోజే 352 పాజిటివ్ కేసులు, ముంబైలో 150, తొమ్మిది మంది మృతి
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో హై స్పీడ్లో పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 352 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 334కి చేరుకున్నది. సోమవారం ఒక్కరోజే 11 మంది చనిపోయారని మహారాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. 1549 కేసులు రిపోర్ట్ కావడం ఆందోళన కలిగిస్తోంది.
సోమవారం మహారాష్ట్రలో 11 మంది చనిపోగా.. ముంబైలోనే 9 మంది చనిపోయారు. వీరితో కలిపి దేశ ఆర్థిక రాజధానిలో మృతుల సంఖ్య 100కి చేరుకున్నది. సోమవారం ముంబైలో 150 పాజిటివ్ కేసులు ఒక్క ముంబైలోనే రికార్డయ్యాయి. దీంతో సిటీలో వైరస్ పాజిటివ్ కేసులు 1549కి చేరుకున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో దేశ ఆర్థిక రాజధాని అల్లాడిపోతున్నది.
Recommended Video
మరోవైపు తమిళానాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే చెన్నైలో 200 పాజిటివ్ కేసులు రావడం భయాందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఏడు జిల్లాల్లో హై అల్టర్ట్ విధించారు. మరో వైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా 356 కొత్త కేసులు నమోదయ్యాయి.