వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: మహారాష్ట్రలో ఒక్కరోజే 352 పాజిటివ్ కేసులు, ముంబైలో 150, తొమ్మిది మంది మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో హై స్పీడ్‌లో పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 352 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 334కి చేరుకున్నది. సోమవారం ఒక్కరోజే 11 మంది చనిపోయారని మహారాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. 1549 కేసులు రిపోర్ట్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

 352 corona positive cases record in maharashtra

సోమవారం మహారాష్ట్రలో 11 మంది చనిపోగా.. ముంబైలోనే 9 మంది చనిపోయారు. వీరితో కలిపి దేశ ఆర్థిక రాజధానిలో మృతుల సంఖ్య 100కి చేరుకున్నది. సోమవారం ముంబైలో 150 పాజిటివ్ కేసులు ఒక్క ముంబైలోనే రికార్డయ్యాయి. దీంతో సిటీలో వైరస్ పాజిటివ్ కేసులు 1549కి చేరుకున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో దేశ ఆర్థిక రాజధాని అల్లాడిపోతున్నది.

Recommended Video

Coronavirus: Deoband Mosque Now Centre For COVID 19 Spread Like Nizamuddin Markaz

మరోవైపు తమిళానాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే చెన్నైలో 200 పాజిటివ్ కేసులు రావడం భయాందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఏడు జిల్లాల్లో హై అల్టర్ట్ విధించారు. మరో వైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా 356 కొత్త కేసులు నమోదయ్యాయి.

English summary
352 coronavirus positive cases record in maharashtra, 11 people are dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X