నిబంధనల ఉల్లంఘన: బ్రిటన్లో 38 మంది భారతీయుల నిర్బంధం
38 మంది భారతీయులను బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్ జాతీయుడు క
న్యూఢిల్లీ/లండన్: 38 మంది భారతీయులను బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు. మరొక ఆఫ్గాన్ జాతీయుడు కూడా అరెస్టు అయ్యాడు.
లీచెస్టర్ నగరంలోని రెండు వస్త్ర కర్మాగారాలపై ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందం గతవారం దాడులు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. 31 మంది వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలోనే కొనసాగుతున్నారని గుర్తించారు అధికారులు.
అంతేగాక, ఏడుగురు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, ఒకరు వీసా నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగం చేస్తున్నారని అధికారులను ఉటంకిస్తూ స్థానిక 'లీచెస్టర్ మెర్క్యూరీ' పత్రిక వెల్లడించింది.
కాగా, వీరిని ఉద్యోగులుగా చేర్చుకున్న రెండు కంపెనీలైన ఎంకే క్లాతింగ్ లిమిటెడ్, ఫ్యాషన్ టైమ్స్ యూకే లిమిటెడ్ పైనా భారీ జరిమానాలను విధించే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.