భారత్ తో కరోనా కల్లోలం: 4,205 మరణాల భారీ రికార్డు, దేశం వణుకుతోంది
భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా 3,48,421 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క రోజువారీ కోవిడ్ మరణాల సంఖ్య గత 24 గంటల్లో 4,205 మరణాలతో కొత్త భయంకరమైన రికార్డును నమోదు చేసింది.
దేశంలో దాదాపు 90 శాతం మంది అధిక కోవిడ్ పాజిటివిటీ రేటు
దేశంలో దాదాపు 90 శాతం మంది అధిక కోవిడ్ పాజిటివిటీ రేటును చూస్తున్నారు. 734 లో 640 జిల్లాలు నిత్యం 5 శాతం పాజిటివిటీ రేటు కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.భారతదేశంలో కేసుల తీవ్రతతో ముడిపడి ఉన్న కోవిడ్ -19 - బి .1.617 యొక్క ఒక వైవిధ్యం 44 దేశాలలో కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత వైవిధ్యకరమైన ఆందోళనగా పేర్కొన్న కొన్ని రోజుల తరువాత కనుగొనబడింది.ఈ వేరియంట్ మొదటిసారి అక్టోబర్లో భారతదేశంలో కనుగొనబడింది.
కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,55,338
భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,55,338 మంది. ఒక్క రోజులో కరోనా బారిన పడిన వారి కంటే, రికవరీలు ఎక్కువగా ఉండడం కాస్త ఊరట కలిగించే అంశం. అయినప్పటికీ మరణాల రేటు అధికం కావటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా, మరణాలు మాత్రం భారీ స్థాయిలో నమోదవుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Recommended Video
గత 24 గంటల్లో 4,205 మరణాలు
తాజాగా కరోనా మహమ్మారి కారణంగా నమోదైన ఒక్కరోజు మరణాల గత 24 గంటల్లో నమోదైన 4,205 మరణాలు భారీ రికార్డు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,0 4,0 98 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 2,54,197 మంది మృతి చెందారు.